ఏపీలో ముగిసిన నామినేషన్ల పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
నవంబర్ 14న గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీలకు.. నెల్లూరు కార్పొరేషన్కు నవంబర్ 15న.. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్పైనే అందరి దృష్టి నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను దక్కించుకుంటామనే ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.మరోవైపు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. కీలకమైన స్థానాల్లో ముఖ్య నేతలంతా మకాం వేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తమకు అనుకూలంగా ఉన్నవారినే ఆర్వోలుగా పెట్టుకుంటోందని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!