టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో వున్నాడని…చురకలు అంటించారు ఎమ్మెల్యే ఆర్. కె రోజా. ఇవాళ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న పండగ పూట ఎన్నిక లేంటి అని అంటున్నాడని… ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల కమిషన్ కు సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నపుడు అన్ని నచ్చాయని… ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలు తప్పులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు…
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వార్ హీటు పెంచుతుంది.. మాజీ సీఎం, టీడీపీ అధినేత సొంతం నియోజకవర్గం కావడం.. వైసీపీ ఆ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మున్సిపల్ వార్ హీట్ పెంచుతుంది.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్ చేసింది.. కుప్పంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని దీమాతో ఉంది.. దీంతో.. సొంతగడ్డపై చంద్రబాబుకి మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్లోకి…
గ్రేటర్ విశాఖపట్నం మున్సిప్ కార్పోరేషన్ పరిధిలో 31వ వార్డు కార్పొరేటర్ పదవికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యం అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే వానపల్లి రవికుమార్ సతీమణి గాయత్రిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం. అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు పార్టీ…
చిత్తూరు జిల్లాలో ఆ ఇద్దరు నాయకుల మధ్య వైరం పీక్స్కు చేరింది. ఓపెన్గానే సవాళ్లు విసురుకుంటున్నారు. మాటలతో ఒకరు.. కవ్వింపులతో ఇంకొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పుంగనూరు గిత్తకు పొగరెంత అని లెక్కలేసుకుంటున్నాయి శ్రేణులు. వారెవరో.. ఏంటో లెట్స్ వాచ్..! చంద్రబాబు కుప్పంలో గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్..! చిత్తూరు జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకొనే…
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్. ఎన్నికల్లో ఇంఛార్జ్గా ఉన్నా.. ఫైనాన్స్ మేటర్స్ డీలింగ్ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట. పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్..! ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా…
విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందు రైతులు తమకు రావాల్సి బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రజలైనా, ప్రతి పక్షమైనా, చివరికి అన్నదాతలనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అన్నారు. Read Also : ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం అంతేకాకుండా చెరకు రైతులపై ప్రభుత్వం…
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్.. అందరూ హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రజలు వీళ్లను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓటు మాత్రం పులివెందులలో ఉందని గుర్తుచేశారు. ఇక, బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని సెటైర్లు వేశారు.. ఈ పాదయాత్ర…
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని…
న్యాయస్థానం నుంచి దేవస్థానం అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి ఎందుకు వెళ్లరని టీడీపీని ఉద్దెశించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ వరకు ప్రయాణం చేసి ఏదో విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేయటానికి కుట్రలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ముందుండి ఇలాంటి చర్యలకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య కాదా అని సజ్జల ప్రశ్నించారు. ఈ పాదయాత్రకు వెళ్తున్న సమయంలో సీమ వాసులు కూడా…
రాష్ట్రఅవతరణ దినోత్సవం రోజున వైఎస్సార్ అవార్డుల కార్యక్రమాన్ని జరపడాన్ని ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధం లేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం తప్పని ఇది సరికాదని, మహానీయుడు పొట్టిశ్రీరాములును అవమానించడమేనన్నారు. పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పాణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అమరజీవికి ఓ దండ వేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర…