కుప్పం మున్సిపాల్టీని పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలిపోయి మా సత్తా చూపిస్తామంటాయి ఆ రెండు జాతీయ పార్టీలు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తొడగొట్టే ఆ పార్టీలు, లోకల్ పోరులో మాత్రం మాకెందుకులే అన్నట్లు ఉన్నాయి. అసలు అలాంటి పోరు ఒకటి ఉందని కాషాయ పెద్దలు నోరుకు మెదపకపోవడం ఇప్పుడు అ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
కుప్పం…. టిడిపి అదినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం…. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది… వరుసగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబుకు, అక్కడి పసుపు దళానికి అత్యంత కీలకమైన ఎన్నికగా కుప్పం మున్సిపల్ పోరు మారింది. వరుసగా పంచాయతీ, జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికల ఓటమి తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో కంచుకోటను కాపాడుకోవడానికి బాబు కోటరీ తీవ్రంగా పనిచేస్తుంది. ఇక అధికార వైసీపీ సైతం కుప్పంలో గెలిచి….బాబుకు చెక్ పెట్టాలని ఆరాటపడుతోంది. అయితే ఈ రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా ఉంటే…. ఎక్కడ ఎన్నికలుంటే, అక్కడ మాదే విజయం అంటూ బరిలో దిగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని టాక్ వినపడుతోంది.
Also Read
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగే కీలక ఎన్నికల్లో ఏపిలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయం పార్టీ నేతలు, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబు, పెద్దిరెడ్డి, అమరనాధరెడ్డి లాంటి నేతలు మాటలు తూటాలు పేలుస్తూ సై అంటే సై అంటుంటే … బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా ఇతర కీలక నేతలు కుప్పం పోరులో నోరుకూడా మెదపకుండా ఉన్నారని ఆ పార్టీ నేతల్లోనే చర్చలు నడుస్తోందట.
25 వార్డులుండే కుప్పం మున్సిపాలిటీలో బిజెపి ఐదు చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి చేతులు దులుపుకున్నాయి. అసలు అక్కడ కనీసం అభ్యర్థులు ఉన్నారా లేదా అనేదానిపై, కాషాయ పెద్దలు చిత్తూరు నేతలతో మాట్లాడలేదట. మరోవైపు టిడిపి, వైసీపీలోని కీలక నేతలందరూ కుప్పంలో వాలిపోతే.., కాంగ్రెస్, బిజెపి నేతలు మాత్రం కనీసం మాట్లాడటం కూడా లేదట. బిజెపి కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెసు పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది కాని…కాషాయం మాత్రం కామ్ గానే ఉందట. మొన్నటి బద్వేల్ ఉప ఎన్నికలలో బరిలో అభ్యర్థిని నిలపకపోయినా ఫర్వాలేదు అనేచోట మాత్రం నానా రచ్చ చేసి డిపాజిట్ కోల్పోయిన బిజెపి, అత్యంత కీలకంగా మారిన కుప్పం మున్సిపల్ పోరులో మాత్రం సైడ్ అవ్వడానికి కారణం ఏంటన్న చర్చజిల్లాలో మొదలైంది.
బిజెపికి పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందా, లేక కావాలనే దూరంగా ఉందామని అనుకున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా సాగుతోంది. పార్టీ అగ్రనేతలు పట్టించుకోకున్నా, పాపం పార్టీపైన అభిమానం చావని కొంతమంది తూతూ మంత్రంగా ఐదుగురు అభ్యర్థులతో నామినేషన్లు వేశారే తప్ప ప్రచారం కూడా లేదని టాక్. చంద్రబాబు మూడురోజులు పర్యటించి, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే తిష్టవేసుకుని కూర్చుంచే …జాతీయ పార్టీల మౌనం మాత్రం ఎవరికి అంతుపట్టకుండా ఉందటా…
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!