Byelections 2025: ఢిల్లీతో సహా మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్..
- ఢిల్లీ అసెంబ్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్..
- యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులో ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ఓటింగ్..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపిన ఎలక్షన్ కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో ఉత్తరప్రదేశ్ లోని మల్కిపురిలో బైపోల్ అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచాడు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ రోజు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉండగా.. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతుంది.
Read Also: Mangalavaaram: ‘మంగళవారం’ మూవీ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
Also Read
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
అలాగే, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మరణించడంతో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. డీఎంకే తరఫున వీసీ చంద్ర కుమార్ బరిలోకి దిగుతుండగా.. అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్ చేస్తున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు ఈ బైపోల్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కుు వినియోగించుకోనున్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8వ తేదీన ఈసీ వెల్లడించనుంది.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!