Tamil Nadu: “స్కంధమలై”ని “సికిందర్ మలై”గా మార్చాలి.. కుమారస్వామి ఆలయంపై వివాదం..
- కుమారస్వామి పుణ్యక్షేత్రంపై వివాదం..
- స్కంధమలైని సికిందర్మలైగా మార్చాలని ముస్లింల డిమాండ్..
- 144 సెక్షన్ విధించిన ప్రభుత్వం..
- హిందూ సంఘాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంల అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మధురై జిల్లాలో మంగళవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. హిందూ వ్యతిరేక సమూహాలు, రాష్ట్రం ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఈ పరిణామాలు ఏర్పడ్డాయి.
Read Also: Health Tips: ఫీవర్తో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
తిరపరంకుండ్రం కొండను భక్తులు ‘‘స్కంధమలై’’గా పిలుస్తారు. ఈ కొండ పేరుని ‘‘సికిందర్మలై’’గా మార్చాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో వివాదం ప్రారంభమైంది. తిరుపరంకుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకున్నట్లుగా చూపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో హిందవులు, కుమారస్వామి భక్తుల్లో తీవ్రం ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నా కూడా డీఎంకే ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందని హిందూ సంఘాలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కొండపై ఒక దర్గా కూడా ఉంది. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినందున హిందూమున్నాని అనే సంస్థ నిరసనలకు ప్లాన్ చేసింది. అధికారులు వారికి అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసన చేయాలని భావిస్తున్నారు.
మధురై అంతటా శాంతిభద్రతల ఆందోళనలను పేర్కొంటూ అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. గుడి, దర్గా రెండింటిలోనూ భక్తులను దర్శనం చేసుకోకుండా పోలీసులు కొండ ప్రవేశద్వారం వద్ద బారికేడ్లు వేశారు. తేని జిల్లాలసమీపంలోని అండిపట్టి కనవై, ఉసిలం పట్టి తేవర్ విగ్రహ ప్రాంతం, , దిండిగల్ జిల్లా సరిహద్దుకు సమీపంలోని ఉత్తప్పనాయకనూర్, ఎలుమలై జంక్షన్ వంటి కీలక తనిఖీ కేంద్రాల వద్ద కఠినమైన వాహన తనిఖీలు జరిగాయి.
తిరుప్పూర్లో ఉద్రిక్తతలు పెరిగాయి. నిరసన కోసం మధురై చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న హిందూ అనుకూల వర్గాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై , అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్షన్ 144 ఉన్నప్పటికీ మధురైలో ఒక డీఎంకే నాయకుడు ర్యాలీని ఎలా నిర్వహించారని అన్నామలై ప్రశ్నించారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!