ఆఫ్ఘనిస్తాన్లో అరాచక పాలన మొదలైంది. శాంతి మంత్రం జపిస్తూనే తాలిబన్లు తమ మార్క్ హింసను చూసిస్తున్నారు. దేశం విడిచిపారిపోవాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేవారిపై దాడులు చేయడం, కాల్పులు జరపడం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు తాలిబన్లు. ఇక మహిళల విషయంలో తాలిబన్లు ఎంతటి కౄరంగా ప్రవర్తిస్తారో వేరే చెప్పక్కర్లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వస్తే వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారెంటీ…
తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్…
తాలిబన్లకు అన్ని విధాలుగా సహకరిస్తోంది పాకిస్థాన్. అఫ్ఘాన్ ఆర్మీతో పోరులో తాలిబన్లకు సహకరించాయి పాక్ ఉగ్రవాద సంస్థలు. అఫ్ఘాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక POK తిరిగి వచ్చాయి ఆ ఉగ్రమూకలు. ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో తాలిబన్లకు.. తమ చెప్పుచేతల్లో ఉండే ఉగ్ర సంస్థల ద్వారా సహకారం అందించింది పాక్. పైకి అమెరికాకు సహకరిస్తున్నట్లే ఉన్నా.. లోలోపల మాత్రం తాలిబన్లకు సహకరించింది. ఈ విజువల్స్ ద్వారా.. పాక్ పన్నాగం బయటపడింది. ఉగ్రవాదులు తిరిగివచ్చినప్పుడు..లష్కరే తోయిబా,…
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్షీర్ ఫైటర్స్కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై…
అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంన్నట్టు ప్రకటించిన తరువాత పూర్తిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అంత త్వరగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారని అనుకోలేదు. దీంతో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 31 వరకు ఆఫ్ఘన్లోని అమెరికా పౌరులను, అమెరికా అధికారులను తరలించాలని సైన్యం టార్గెట్ పెట్టుకుంది. ఆగస్టు31 వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఖాళీచేసి వచ్చేయాలని అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు 31 వరకు…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. అయితే, కాబూల్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి… అ నేపథ్యంలో అమెరికాకు డెడ్లైన్ పెట్టారు తాలిబన్లు… ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా.. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పెట్టింది.. అయితే, అమెరికా పెట్టుకున్న ఆ గడువు పెంచితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాలిబన్లు.. ఆగస్టు…
ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి…
ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్ ప్రావిన్స్లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్షీర్లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా…
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు…