పంజ్షీర్ తాలిబన్ల వశం అవుతుందా? అగ్ర దేశాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ వశం కావడంతో అమెరికా దళాలు వదిలి వెళ్లిన ఆయుధాలు తాలిబన్ల వశం అయ్యాయి. ఇప్పటికే తాలిబన్లు పంజ్షీర్ ప్రావిన్స్ను చుట్టుముట్టారు. ఏ క్షణమైనా వారు విరుచుకుపడే అవకాశం ఉన్నది. అయితే, పంజ్షీర్ దళం అధిపతి మసూద్ అంతర్జాతీయ దేశాల మద్దతు కావాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మసూద్ విజ్ఞప్తిని వారు ఆలకిస్తారు అనుకోవడం పోరపాటే. పోరాటం చేసి పంజ్షీర్ మొత్తం రక్తపాతం అయ్యేకంటే, సంధి చేసుకొని లొంగిపోవడం ఉత్తమం అని మసూద్ అనుకుంటున్నట్టు సమాచారం. పంజ్షీర్ కూడా తాలిబన్ల వశమైతే ఇక ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతిలోకి వెళ్లినట్టే అవుతుంది.
Read: కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బెయిల్…
Also Read
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!