నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం నీట్ 2024 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వగా, వారిలో 67 మంది అభ్యర్థులు నంబర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో.. రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా.. అందుకు ఒప్పుకున్నారు. మరోవైపు.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని.. ఆదేశించింది. హిమాచల్ నుండి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని…
ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ ( గురువారం ) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు కోరింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.
శనివారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు లభించిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1వరకు బెయిల్ ఇచ్చింది.
తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఉన్న భవనాన్ని కూల్చే బదులు.. వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్ పేర్కొన్నాడు.