KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
- విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్..
- దీనిపై నేడు విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Petition: విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితరాలను విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది.
Read also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవవద్దని కోరుతూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును గులాబీ బాస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు నేడు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. గత బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. విచారణలో భాగంగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహారెడ్డి తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కమిషన్కు రాజీనామా చేయాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!