KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
- విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్..
- దీనిపై నేడు విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Petition: విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితరాలను విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది.
Read also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
Also Read
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవవద్దని కోరుతూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. హైకోర్టు తీర్పును గులాబీ బాస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు నేడు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. గత బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. విచారణలో భాగంగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహారెడ్డి తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కమిషన్కు రాజీనామా చేయాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న స్పెయిన్
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?