Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్
- 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రతిపాదన
- నారా లోకేష్ సూచనతో తీసుకున్న కీలక నిర్ణయం
- సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రభుత్వ ఆందోళన
- దేశంలోనే ఏపీ తొలి రాష్ట్రంగా నిలిచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban in AP : మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
సోషల్ మీడియా వినియోగం వల్ల తలెత్తుతున్న అనర్థాలపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే 90 రోజుల్లో (మూడు నెలల్లో) దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 13 ఏళ్లలోపు వారికే కాకుండా, 13 నుంచి 16 ఏళ్ల వయసు గల వారు కూడా సోషల్ మీడియా వాడాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోందని, అందరూ అంగీకరిస్తే ఈ వయసు వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలవ్వడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా, సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమాయక యువత డిజిటల్ మోసాల బారిన పడుతుండటం. సోషల్ మీడియాలో వస్తున్న వల్గర్ మెసేజ్లు, వీడియోలు పిల్లల నైతికతను దెబ్బతీస్తుండటం. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఒత్తిడికి గురవ్వడం వంటి వాటిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
“అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది” అని చంద్రబాబు సభలో ఉద్ఘాటించారు. రాజకీయ పార్టీలైనా, సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే సోషల్ మీడియా దుష్ప్రభావాలకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దేశంలోనే పిల్లల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.
AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
-
Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!