UPSC CSE 2025 Final Result: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 ఈ రోజు( శుక్రవారం) విడుదలయ్యాయి. అనుజ్ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు IAS, IFS, IPS మరియు ఇతర పోస్టులకు అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsc.gov.in లేదా upsconline.gov.inలో రోల్ నంబర్ వారీగా ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also: Assam: అస్సాంలో విషాదం.. సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
టాపర్లు వీరే..
ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచారు, తరువాత రాజేశ్వరి సువే రెండవ స్థానంలో, ఆకాంక్ష్ మూడవ స్థానంలో, రాఘవ్ ఝున్ఝున్వాలా నాల్గవ స్థానంలో, ఇషాన్ భట్నాగర్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అర్హత సాధించిన 958 మందిలో 317 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా, 104 మంది EWS, 3306 మంది OBC, 158 మంది SC, 73 మంది ST కేటగిరీకి చెందినవారు ఉన్నారు.
ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 15 రోజుల్లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రాతపరీక్ష ఆగస్టు, 2025లో జరిగింది. పర్సనాలిటీ టెస్ట్లు డిసెంబర్ 2025, ఫిబ్రవరి 2026 మధ్య జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల ఎంపికకు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రతీ ఏడాది యూపీఎస్సీ ద్వారా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.