Supreme Court : కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court : సీబీఐని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు అర్హమైనదిగా పరిగణించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్ర పరిధిలోకి వచ్చే కేసులను ఏకపక్షంగా సీబీఐకి పంపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రంపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు అధికార పరిధిని సుప్రీంకోర్టు సమీక్షించనుంది. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మెరిట్ ప్రాతిపదికన సుప్రీంకోర్టు విచారించనుంది. ఆగస్టు 13న ఏయే సమస్యలను వినాలనేది నిర్ణయిస్తుంది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్లో చేపట్టనుంది.
Read Also:Minister Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
గతంలో సీబీఐపై తమకు నియంత్రణ లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను అంగీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రాల పరిధిలోని కేసుల విచారణకు సీబీఐని ఎవరు పంపుతారని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946లోని సెక్షన్ 6 ప్రకారం తమ భూభాగంలో సీబీఐ దర్యాప్తునకు తన సమ్మతిని ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. సమ్మతిని ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాష్ట్రానికి పంపి విచారణ జరుపుతోందని రాష్ట్రం అంటోంది. పశ్చిమ బెంగాల్లో సీబీఐ 15కి పైగా కేసులు నమోదు చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఈ కేసు మెయింటెయిన్ చేయదగినది కాదని, దీన్ని మొదట్లోనే కొట్టివేయాలని కోరారు. సీబీఐని సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అని పిటిషనర్లు తప్పుబట్టారు. సీబీఐ ఎక్కడ, ఎలా దర్యాప్తు చేస్తుందో అందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు.
Read Also:New Couple On Bulldozer: బుల్డోజర్ పై ఊరంతా ఊరేగిన నవ దంపతులు..
జస్టిస్ మెహతా కేంద్ర దర్యాప్తు సంస్థను నియంత్రించే DSPE చట్టంలోని సెక్షన్ 5(1)ని ప్రస్తావించారు. చట్టంలోని సెక్షన్ 5(1) కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా రాష్ట్రాలలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. డిఎస్పిఇ కింద సిబిఐ అధికారాలు, అధికార పరిధిని నిర్వచించే హక్కును సెక్షన్ 5(1) కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇస్తుందని జస్టిస్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. ఆర్టికల్ 131 ప్రకారం సీబీఐని ప్రతివాదిగా చేసేలా కేసును సవరించలేమని మెహతా కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!