Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటన.. పిటిషన్పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జూలై 2న జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జూలై 12న విచారణ చేపట్టనుంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ ఘటనపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని.. పిటిషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులు, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనితో పాటు ఏదైనా మతపరమైన లేదా ఇతర కార్యక్రమాలలో ప్రజల భద్రత కోసం తొక్కిసలాటలు లేదా ఇతర సంఘటనలు జరగకుండా మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలని డిమాండ్ కూడా చేశారు.
Read Also:Eye Sight Problems: ఈ కారణాలతో కళ్లని నిర్లక్ష్యం చేస్తున్నారా.. జాగ్రత్త సుమీ..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
భోలే బాబా సత్సంగం జూలై 2, మంగళవారం నాడు హత్రాస్లోని సికంద్రరావులోని ఫుల్రాయ్ ముగల్గర్హి గ్రామంలో ప్రారంభమైంది. 80 వేల మందికి అనుమతి ఉన్నప్పటికీ సత్సంగానికి 2.5 లక్షల మందికి పైగా వచ్చారు. బాబా తన సత్సంగాన్ని ముగించినట్లు ప్రకటించిన వెంటనే, బాబా ప్రైవేట్ సైన్యం వేదిక మొత్తాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ బాబా వ్యక్తిగత సైన్యం లేదా పోలీసులు జనాన్ని నిర్వహించడానికి సరిపోలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బాబా కాన్వాయ్ దాటగానే గుంపు ఆగింది. ఈ సమయంలో పాదాలను చూసుకునే క్రమంలో అనుచరులు అదుపుతప్పారు. తొక్కిసలాట సమయంలో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. బాబా సేవకులు వాహనాల్లో పారిపోతూనే ఉన్నారు. ఎవరూ ఆగి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
Read Also:Tirumala Darshanam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించగా యూపీ పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం ఉన్న నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో రామ్ లదైతె యాదవ్ (మెయిన్పురి), మంజు యాదవ్ (హత్రాస్), ఉపేంద్ర సింగ్ యాదవ్ (ఫిరోజాబాద్), మంజు దేవి యాదవ్ (హత్రాస్), మేఘ్ సింగ్ (హత్రాస్), ముఖేష్ కుమార్ (హత్రాస్) ఉన్నారు. వీరంతా సేవకులే.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!