సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు…
పాకిస్తాన్లో హిందూవులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఒక్క దేవాలయం కూడా నిర్మించలేదు. పైగా వేలాది దేవాలయాలను కూల్చివేశారు. ఇక ఇదిలా ఉంటే, పాక్లో ఇటీవలే ఓ కొత్త ఆలయాన్ని నిర్మించారు. పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వం చేత ఆలయాన్ని నిర్మించింది. ఆలయ పునర్నిర్మాణం అనంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ గుల్జార్ అహ్మద్ ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు…
బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు. హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో…
కొద్ది రోజుల క్రితం పెగాసిస్ స్పైవేర్ యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. భారత్ పార్లమెంట్ని తీవ్రంగా కుదిపేసిన పెగాసిస్ అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఈ వివాదం మరోసారి మీడియా హెడ్లైన్లలో నిలిచింది. దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన పెగాసిస్ ఎపిసోడ్లో సుప్రీంకోర్టు తీర్పు ఒక అనూహ్య పరిణామం. ఈ స్పైవేర్ని పౌరులపై ప్రయోగించలేదని కేంద్రం వాదిస్తోంది. ఐతే, కేంద్రం చెపుతున్న…
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్…
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసిస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్పైవేర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి…ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాము సంప్రదించిన నిపుణుల్లో కొందరు…వ్యక్తిగత కారణాలతో కమిటిలో భాగస్వాములు కాలేకపోయారని…ఈ…
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో…
లఖింపూర్ ఖేరీ ఘటనలో యూపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు తెలిపారు. దీన్లో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్…
సాధారణంగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్…
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్మన్ దీపక్ వర్మతో…