అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.
Read Also: కరోనా ప్రళయం.. దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ఉదాహరణకు తెలంగాణనే చూసుకుంటే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,100కు పైగా మరణాలు నమోదయ్యాయి. కానీ కరోనా పరిహారం కోసం 29,969 దరఖాస్తులు వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఇప్పటికే 12వేలకు పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయిందని తెలిపింది. అటు ఏపీలోనూ అధికారుల లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 14,514గా ఉండగా… 36 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైందని తెలిపింది.
Read Also: కోవిడ్పై కేంద్రం ఆందోళన.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
అటు ప్రధాని మోదీ సొంత జిల్లా గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10 వేలుగా ఉంటే పరిహారం కోసం 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్యకు మించి పరిహారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనాతో ఆస్పత్రుల్లో కంటే బయటే ఎక్కువ మంది ప్రజలు మృతి చెందారని సమాచారం. అయితే అలా మరణించిన వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కరోనా పాజిటివ్గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజావార్తలు
-
Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!