‘వై ఐ కిల్డ్ గాంధీ’ రిలీజ్ కు ఓటిటిలోనూ అడ్డంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటి ప్లాట్ఫామ్లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు ఆమోదం పొందలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also : ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో స్టార్ హీరో పోటీ ?
Also Read
- Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
- Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
- Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం గాంధీ, గాడ్సేపై చిత్రానికి వ్యతిరేకంగా న్యాయవాది అనూజ్ భండారీ సికిందర్ బహల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రకారం చిత్రంలో మహాత్మా గాంధీని కించపరిచే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రంలో నాథూరామ్ గాడ్సేని కీర్తించారు. ఈ సినిమా ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాను నిషేధించాలి అంటూ ఈ సినిమా విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్లో అనూజ్ భండారీ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీని కారణంగా ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో విడుదల కానుంది.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపిన రోజు ఇదే. ఆ అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా 2017లోనే పూర్తయింది. థియేటర్లలో విడుదల చేసే అవకాశం రాలేదు. ఈ చిత్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ఎంపి అమోల్ కొల్హే నాథూరామ్ గాడ్సే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై వివాదం నెలకొంది, ఈ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు