‘వై ఐ కిల్డ్ గాంధీ’ రిలీజ్ కు ఓటిటిలోనూ అడ్డంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటి ప్లాట్ఫామ్లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు ఆమోదం పొందలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also : ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో స్టార్ హీరో పోటీ ?
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం గాంధీ, గాడ్సేపై చిత్రానికి వ్యతిరేకంగా న్యాయవాది అనూజ్ భండారీ సికిందర్ బహల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రకారం చిత్రంలో మహాత్మా గాంధీని కించపరిచే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రంలో నాథూరామ్ గాడ్సేని కీర్తించారు. ఈ సినిమా ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాను నిషేధించాలి అంటూ ఈ సినిమా విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్లో అనూజ్ భండారీ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీని కారణంగా ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో విడుదల కానుంది.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపిన రోజు ఇదే. ఆ అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా 2017లోనే పూర్తయింది. థియేటర్లలో విడుదల చేసే అవకాశం రాలేదు. ఈ చిత్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ఎంపి అమోల్ కొల్హే నాథూరామ్ గాడ్సే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై వివాదం నెలకొంది, ఈ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!