‘వై ఐ కిల్డ్ గాంధీ’ రిలీజ్ కు ఓటిటిలోనూ అడ్డంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటి ప్లాట్ఫామ్లలో సినిమాల విడుదలపై పరిమితుల గురించి ఎలాంటి రూల్స్ లేవు. ఓటీటీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఓటిటి విడుదలకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. గాంధీ, గాడ్సేపై రూపొందిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ విడుదలపై నిషేధం విధించే అంశం మరింత ముదిరింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు ఆమోదం పొందలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also : ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో స్టార్ హీరో పోటీ ?
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్పై కేసు నమోదు!
- Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం గాంధీ, గాడ్సేపై చిత్రానికి వ్యతిరేకంగా న్యాయవాది అనూజ్ భండారీ సికిందర్ బహల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రకారం చిత్రంలో మహాత్మా గాంధీని కించపరిచే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రంలో నాథూరామ్ గాడ్సేని కీర్తించారు. ఈ సినిమా ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాను నిషేధించాలి అంటూ ఈ సినిమా విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్లో అనూజ్ భండారీ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీని కారణంగా ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో విడుదల కానుంది.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపిన రోజు ఇదే. ఆ అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా 2017లోనే పూర్తయింది. థియేటర్లలో విడుదల చేసే అవకాశం రాలేదు. ఈ చిత్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ఎంపి అమోల్ కొల్హే నాథూరామ్ గాడ్సే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై వివాదం నెలకొంది, ఈ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!