‘సుప్రీం’లో కోవిడ్ కలకలం.. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజు వారిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 30 శాతం మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది..
Read Also: ఇక, అన్ని ఏఎన్ఎం, పీహెచ్సీల్లో కోవిడ్ టెస్ట్లు..
Also Read
సుప్రీం కోర్టు సిబ్బంది సుమారు 1500 మంది ఉండగా, అందులో 400 మందికి ఇప్పటికే కోవిడ్ సోకింది.. ప్రతి రోజు 100 నుంచి 200 వరకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యసిబ్బంది. ఇక, రోజువారి అత్యవసర కేసుల విచారణ జరిపేందుకు ధర్మాసనాలను ఏర్పాటు చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పాలనాపరంగా పెద్ద సవాల్గా మారింది. మరోవైపు.. న్యాయమూర్తులు, పాలనా సిబ్బంది ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..