మరోసారి సుప్రీంకోర్టుకు చేరిన పెగాసస్ వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు చేసింది!
Also Read
2017లో ఇజ్రాయెల్తో పెగాసస్పై డీల్ జరిగిందంటూ న్యూయార్క్ టైమ్స్ తాజా ప్రచురించిన కథనం దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకునే అవకాశాలున్నాయి. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
-
Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!