కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ సీఎస్కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది.. వారు చట్టానికి అతీతులు కాదు.. మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాల్సిందేనంటూ ఈ సందర్భంగా స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
Read Also: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి బెజవాడ పోలీసులు..
కాగా, కోవిడ్తో మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా పరిహారం చెల్లింపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA)ని జూన్ 30, 2021న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను NDMA విజ్ఞతకే వదిలివేసింది కోర్టు.. తదనంతరం, కోవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. మరణించిన వారి బంధువులకు రూ.50,000 చెల్లించాలని కేంద్రం చేసిన సిఫార్సును కోర్టు అక్టోబర్ 2021లో ఆమోదించింది. అయితే, పరిహారం చెల్లింపు విషయంలో జాప్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. తక్షణం సుప్రీంకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.