ఏపీ సీఎస్పై సుప్రీం సీరియస్.. 2 గంటలకు కోర్టు ముందుకు రండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ సీఎస్కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది.. వారు చట్టానికి అతీతులు కాదు.. మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాల్సిందేనంటూ ఈ సందర్భంగా స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
Read Also: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి బెజవాడ పోలీసులు..
Also Read
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
కాగా, కోవిడ్తో మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా పరిహారం చెల్లింపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA)ని జూన్ 30, 2021న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను NDMA విజ్ఞతకే వదిలివేసింది కోర్టు.. తదనంతరం, కోవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. మరణించిన వారి బంధువులకు రూ.50,000 చెల్లించాలని కేంద్రం చేసిన సిఫార్సును కోర్టు అక్టోబర్ 2021లో ఆమోదించింది. అయితే, పరిహారం చెల్లింపు విషయంలో జాప్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. తక్షణం సుప్రీంకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!