పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో ఉపాధ్యాయుడు చేరిపోయాడు.విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చి దిద్దాల్సిన గురువు.. వారి చేతులతో మసాజ్ చేయించుకున్నాడు.
భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లపై నుంచి సహాయం చేయాలని కోరుతున్నారు. ఇక, వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. అయితే, హంటర్ రోడ్డులోని ఓ లేడీస్ హాస్టల్ లో 200 మంది విద్యా్ర్థినీలు చిక్కుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు శివన్న కూడా బదిలీ అయ్యారు.. పిల్లలకు కేవలం చదువు చెప్పడమే కాదు వారి ఆప్యాయత అనురాగాలను చూరగొన్న శివన్న.. బదిలీ కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు.. ఇక, విద్యార్థుల కంటతడి చూసి తాను కూడా బోరున ఏడ్చేశాడు శివన్న.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంలో కొందరు విద్యార్థులను, కొన్ని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనల సందర్భంగా ఆంక్షలను విధించడం సర్వసాధారణం. అయితే ఆ ఆంక్షలు ట్రాఫిక్కు ఇబ్బంది రాకుండా చూడటానికి ఎక్కువగా పెడతారు.
ఐఐటీ బాంబే ప్రపంచస్థాయి యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచస్థాయి యూనివర్సిటీల గుర్తింపుకు సంబంధించి ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే 149వ స్థానలో నిలిచింది.