తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ.. క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవాళ్టి( ఆదివారం)తో ముగిసిపోనున్నాయి. రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు పాస్పోర్టు సమస్యలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు పాస్పోర్టును ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో 229 రోజుల పాటు పని చేయనున్నాయి. అక్టోబర్ 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులను ఇవ్వనున్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి హాస్టల్కు రావడంతో.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగటంతో వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
బస్సులో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాలి.. లేదంటే బస్ పాస్ ఉండాలి.. అది కాదంటే రవాణా శాఖకు చెందిన ఉద్యోగులైనా అయి ఉంటే వారు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. మరీ ఉచితంగా బస్లో ప్రయాణం చేయాలంటే ఎలా..