Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!
- తంబళ్ళపల్లిలో నాయకత్వం కోసం టీడీపీ వెదుకులాట..
- 2019 తర్వాత ఇక్కడ దారుణంగా పార్టీ పరిస్థితి..
- గత ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి పార్టీ టిక్కెట్, ఓటమి..
- జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్ వర్గాల రచ్చ..
- మొలకలపల్లి నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి..
- జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం..
- తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం శంకర్యాదవ్ ప్రయత్నాలు..
- అజ్ఞాతంలో ఉన్న జయచంద్రారెడ్డి తాజా వీడియో..
- శంకర్ యాదవ్ను అడ్డుకోమంటూ తన సన్నిహితులకు సూచన..
- రెండు వర్గాలతో వేగలేకపోతున్నామంటున్న పాత టీడీపీ కేడర్..
- శంకర్ యాదవ్ మాకొద్దంటున్న పాత టీడీపీ నాయకులు.. త్రిసభ్య కమిటీని వేసే ఆలోచనలో టీడీపీ అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆవిర్భావం తర్వాత టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు నాయకత్వం కోసం వెదుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబం పార్టీతో ఉన్నన్ని రోజులు ఆ లోపం కనిపించలేదు. ఇక 2014లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ గెలిచారు. అలాగే 2019లో ఆయన మీద వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి గెలిచారు. ఇక ఆ తర్వాత తంబళ్లపల్లిలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. జిల్లా అగ్ర నాయకులు కనీసం ఇటువైపు దృష్టి సారించలేదు. ఇక గత ఎన్నికల్లో అభ్యర్థి విషయమై చివరి దాకా లాగినా… అధిష్టానం చివరికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కాదని జయచంద్రారెడ్డికి టికెట్టు ఇచ్చింది. ఆయన వైసీపీ అనుకూలుడంటూ శంకర్ వర్గం వ్యతిరేకించింది. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా జయచంద్రారెడ్డికే టిక్కెట్ ఇవ్వడం, దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం తర్వాతి పరిమామాలు. ఇక అప్పటి నుండి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు శంకర్ అనుచరులు. ఆయన టీడీపీ కేడర్కు దూరంగా, వైసీపీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారని కూడా ఆరోపించారు. రెండు వర్గాలు రోడ్డెక్కి కొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల గొడవ నుండి ఇన్చార్జ్ మంత్రి సమావేశంలో రచ్చదాకా… ఏదో ఒక వ్యవహారం రెండు గ్రూపుల మధ్య నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో ఎవరు ఊహించని విధంగా మొలకలచెరువు నకిలీ మద్యం వ్యవహారం బయట పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. జయచంద్రారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది మీద కూడా దీనికి సంబంధించి కేసులు నమోదవడంతో పార్టీ ఆయన్ని ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తప్పించడమేగాక సస్పెండ్ చేసింది కూడా. ఇక అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నారు జయ చంద్రారెడ్డి. దీంతో.. నాకే ఇన్ఛార్జ్ పోస్ట్ కావాలంటూ శంకర్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు పదవి వచ్చేసినట్టేనంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఈ పరిణామ క్రమంలో…. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జయచంద్రా రెడ్డి ఒక వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియోలో శంకర్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారాయన. వైసీపీతో కుమ్మక్కయి సొంత పార్టీ క్యాడర్ దగ్గరే 10% కమీషన్ వసూలు చేసిన శంకర్ యాదవ్కు ఇన్ఛార్జ్ పదవి అంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తన తప్పు లేకపోయినా కేసు పెట్టారని, నిజాయితీగా బయటకు వస్తానని చెబుతూనే… శంకర్ని ఇన్ఛార్జ్గా నియమించకుండా పోరాటం చేయాలంటూ తన వర్గానికి సూచించడం కలకలం రేపుతోంది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ఇలా నియోజవర్గంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేశారని, ఇప్పుడు మా బాధలు వినేవాడే నియోజకవర్గంలో లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకల్ తమ్ముళ్లు. మరోవైపు ఈ రెండు వర్గాలకు సంబంధం లేకుండా ఉంటున్న పాత టిడిపి క్యాడర్ ఆవేదన మాత్రం మరింత వర్ణనాతీతంగా ఉందట. వీళ్లతో వేగలేకపోతున్నామంటూ అమరావతికి వెళ్లి పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారట. గతంలోనే శంకర్యాదవ్ని వ్యతిరేకించిన పాత టీడీపీ కేడర్ మళ్లీ ఆయన్ని రానిచ్చే ప్రసక్తే లేదని అంటోందట. దీంతో కొద్ది రోజుల పాటు ఇన్చార్జి పదవి అంశాన్ని పక్కనపెట్టి త్రిసభ్య కమిటీని వేస్తే బెటరన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అలా కాకుండా శంకర్ యాదవ్కు ఇస్తే మాత్రం మా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిపోతుందని అంటున్నారట లోకల్ టీడీపీ కార్యకర్తలు. ఒకప్పటి కంచుకోటలో టీడీపీ పెద్దలు పార్టీని ఎలా సెట్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!