Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్గా చేసుకొనే హెల్దీ పాయసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chana Dal Payasam: మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ అంటే మొదట గుర్తొచ్చేది ‘శెనగబేడల పాయసం’. పప్పులు, బియ్యం రవ్వ, కమ్మని బెల్లం కలయికతో చేసే ఈ పాయసం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్.. పండగ ఏదైనా, ఈ పాయసం ఉంటే ఆ విందు పూర్తి అయినట్లే. మరి ఆ పాతకాలపు రుచిని నేటి తరానికి నచ్చేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Tragedy : హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!
Also Read
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారీ విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
శెనగబేడల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవే..
పచ్చి శెనగపప్పు – 1 చిన్న బౌల్
బియ్యం – పావు బౌల్
సగ్గుబియ్యం – పావు బౌల్
బెల్లం – 1.5 నుండి 2 బౌల్స్
నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి
పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు (ఆప్షనల్)
తయారీ విధానం..
శెనగపప్పు, బియ్యంను విడివిడిగా ఒక గంట పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యాన్ని 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా (కొంచెం బరకగా) గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 8 కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన శెనగపప్పు, సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. పప్పు ఉడికాక, గ్రైండ్ చేసిన బియ్యం రవ్వను కొద్దిగా నీళ్లలో కలిపి (ఉండలు కట్టకుండా) పాయసంలో వేసి ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్, ముఖ్యంగా ఎండు కొబ్బరి ముక్కలను వేయించి పాయసంలో కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
* పచ్చి శెనగపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మతుకు, శరీరానికి అవసరమైన బలాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది.
* ఈ పాయసంలో పంచదారకు బదులు మనం బెల్లాన్ని వాడుతున్నాం. బెల్లం ఒక అద్భుతమైన ఐరన్ (ఇనుము) వనరు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
* శెనగపప్పు, సగ్గుబియ్యం రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడానికి, కీళ్ల నొప్పులను నివారించడానికి సహాయపడతాయి.
* బియ్యం రవ్వ, సగ్గుబియ్యం తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులో మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేయడానికి ఇది ఒక మంచి ఆహారం.
* శెనగపప్పులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బియ్యం రవ్వలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణమే పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
* పచ్చి శెనగపప్పులో పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందిస్తాయి.
ఆరోగ్యంతో పాటు అమ్మమ్మల కాలం నాటి ఆ రుచిని ఆస్వాదించాలంటే, తప్పకుండా మీకు సమయం ఉన్నప్పుడు ఈ శెనగబేడల పాయసాన్ని ఒకసారి మీ ఇంట్లో ప్రయత్నించండి.. కచ్చితంగా ఇది మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
READ ALSO: Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్గా చేసుకోండి!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..