Telangana: బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాంకెట్లు, బెడ్ షీట్స్, నోట్ బుక్స్ తదితరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 302 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 35 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీటి కోసం ప్రతి ఏటా 15 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది.
Also Read: Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో
బీసీ హాస్టళ్ల ద్వారా వేల మంది పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు. గతంలో హాస్టళ్లలో డైట్ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకోవడాన్ని ఆ సంఘాలు స్వాగతించాయి.