Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!
- ప్రజావారధి పేరుతో రాజమండ్రిలో బీజేపీ ప్రోగ్రామ్..
- సేమ్ టు సేమ్ కలెక్టర్ ఆఫీస్లోని గ్రీవెన్స్ సెల్ లాంటిదే..
- ప్రతి సోమవారం అన్ని కలెక్టరేట్స్లో గ్రీవెన్స్ కార్యక్రమం..
- ప్రతి శుక్రవారం బీజేపీ ఆఫీస్లో ఫిర్యాదుల ప్రోగ్రామ్..
- పెన్షన్లు, ఇతర సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణ..
- అధికారులకు ఫార్వార్డ్ చేస్తామంటున్న బీజేపీ నేతలు..
- ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వాలన్న ప్లానింగ్ ఉందా?..
- పొలిటికల్ మైలేజికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా?..
- ప్రభుత్వ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదంటున్న బీజేపీ నాయకులు..
- ఏం చేసినా ప్రజలకు మేలు జరిగితే అదే పదివేలన్న చర్చలు..
Off The Record: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓవైపు ఏపీ యంత్రాంగం పనిచేస్తున్నా…దానికి సమాంతరంగా రాజమండ్రిలో బీజేపీ చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశమైంది. ప్రజావారధి పేరుతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ చుట్టూ…. సరికొత్త ప్రశ్నలు పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల్ని ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార స్టేటస్ను ట్రాక్ చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. పారదర్శకంగా, అధికారికంగా సమస్యల పరిష్కారానికి అమలవుతున్న విధానం అది. కానీ… దానికి సమాంతరంగా రాజమండ్రి బీజేపీ ఆఫీస్లో ప్రతి శుక్రవారం ప్రజావారధి పేరుతో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మీ సమస్య- మా బాధ్యత అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇందులో పార్టీ నాయకులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వికలాంగుల పెన్షన్లు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల్లాంటి అంశాలపై వినతి పత్రాలు ఇస్తున్నారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామని చెబుతున్నారు పార్టీ నాయకులు. ఇక్కడే సరికొత్త సందేహాలు వస్తున్నాయి. ప్రతి సోమవారం ప్రభుత్వ గ్రీవెన్స్ వ్యవస్థ నడుస్తుండగానే మళ్లీ ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ ఏంటి? అధికారులకు ఫార్వార్డ్ చేస్తామని చెప్పడం తప్ప… బీజేపీ నాయకులు చూపిస్తున్న పరిష్కారాలేంటన్న చర్చ జరుగుతోంది.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ఫిర్యాదులు అధికారికంగా నమోదు అవుతున్నాయి. సమస్య పరిష్కారం ఎలా జరుగుతుందో కూడా ఫిర్యాదుదారులకు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అదే లక్ష్యంతో పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద బీజేపీకి పూర్తి నమ్మకం లేదా? లేక ప్రజల ఇబ్బందుల గురించి అధికారులకు తెలియడంలేదని నమ్ముతున్నారా? ఈ రెండూ కాకుండా పార్టీ స్థాయిలో ప్రజలతో నేరుగా కనెక్ట్ కావాలన్న వ్యూహమా? అంటూ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్ని రెండు లక్ష్యాలతో నిర్వహించే అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ఒకటి ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అవడం. ఇలాంటి ఫిర్యాదుల స్వీకరణ ద్వారా నాయకులు ప్రజల సమస్యలను నేరుగా వింటే, స్థానికంగా పార్టీ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. పొలిటికల్ మైలేజికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక పార్టీ స్థాయిలో వినతులు స్వీకరించడం ద్వారా మేం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చన్న లెక్కలున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా రాజకీయంగా చర్చకు వస్తోంది.
Also Read
ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీనే ప్రభుత్వ వ్యవస్థకు సమాంతరంగా కార్యక్రమం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు కొందరు. ఇది కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదన్న సంకేతమా?లేక పార్టీ తన సొంత రాజకీయ కార్యక్షేత్రాన్ని విస్తరించుకునే ప్రయత్నమా? అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. అయితే ఈ విషయంలో స్థానిక బీజేపీ నాయకుల వెర్షన్ వేరుగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవచ్చని అలాంటి వాటిని స్థాయిలో పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుందంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని, ప్రజా సమస్యల పరిష్కారానికి మరో వేదిక మాత్రమేనని చెబుతున్నారు కాషాయ లీడర్స్. కానీ…. ఎట్నుంచి ఎటొచ్చినా….ఒక పారదర్శక వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళు కొత్తగా చేసేదేంటి? ప్రజలకు అదనంగా ఒరిగేదేంటన్న చర్చలు మాత్రం ఆగడం లేదు రాజమండ్రిలో. ఆ చర్చలు ఎలా ఉన్నా… బీజేపీ నాయకుల ఉద్దేశ్యం ఏదైనా…. అంతిమంగా ప్రజలకు మేలు జరిగితే అదే పదివేలన్నది బాటమ్లైన్.
తాజావార్తలు
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో