రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు…
తెలుగు చిత్రసీమలో ‘మాస్టారు’గా నిలచిన ఘంటసాల వేంకటేశ్వరరావును తలచుకున్న ప్రతీసారి తెలుగువారి మది పులకించి పోతూనే ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఘనవిజయాలు చూసిన చిత్రాలలో సింహభాగం ఆయన గళమాధుర్యంతో రూపొందినవే. ఇక ఆ నాటి మేటి నటులకు ఘంటసాల గానమే ప్రాణం పోసింది. అలాగే ఆయన స్వరకల్పన సైతం జనాన్ని పరవశింప చేసింది. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అంటారు. ఆ రెండు కళ్ళలోనూ కాంతి నింపిన ఘనత ఘంటసాలదే! “ధారుణి రాజ్యసంపద…
మాటను పట్టుకొని సినిమా బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే విజయం సాధించారు. కొందరు మాటలు పలికించడంతో పాటు, తెరపైనా గిలిగింతలు పెట్టారు. వారిలో రావి కొండలరావు సైతం స్థానం సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటకరచయితగా ఇలా సాగిన తరువాతే చిత్రసీమ బాటపట్టారు రావి కొండలరావు. తరువాత చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అలరించారాయన. రావి కొండలరావు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. రావి కొండలరావు తండ్రి…
సరసాలు పోయిన కలం… నవరసాలు పలికించిన కలం… నీరసాలను దూరం చేసిన కలం… ‘నవ’రసాలను ఊరించిన కలం… ఆ కలం పేరు వేటూరి సుందర రామమూర్తి! పండిత వంశంలో జన్మించిన వేటూర సుందరరాముడు చిత్రసీమలో తనదైన కవితావైభవాన్ని ప్రదర్శించారు. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. అలాంటి వంశంలో పుట్టిన కారణంగా…
గురువేమో నవ్వు నాలుగు వందల విధాల గ్రేటు అన్నారు. శిష్యుడేమో ఆ సూత్రాన్ని పట్టుకొని నలుదిశలా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ గురువు ఎవరంటే ‘నవ్వడం భోగం… నవ్వించడం యోగం… నవ్వకపోవడం రోగం…’ అని చాటిన జంధ్యాల. ఇక ఆ శిష్యుడు ‘నవ్వేందుకే ఈ జీవితం’ అన్నట్టుగా సాగిన ఇ.వి.వి సత్యనారాయణ.తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ మొదలు చివరి దాకా ఏ సినిమా తీసినా, వాటిలో నవ్వులకే పెద్ద పీట వేశారు ఇ.వి.వి. అందుకే ఆయన సినిమాలు…
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్.. ఎంతో హుషారుగా కాయ్రాజాకాయ్ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి.…
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్డౌన్తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.…
శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ –…
తెలుగు చిత్రాలు -యన్టీఆర్ ‘జయసింహ’, ఏయన్నార్ ‘రోజులు మారాయి’తోనే వెలుగు చూసిన వహిదా రెహమాన్, హిందీ చిత్రసీమలో అందాలతారగా రాజ్యమేలారు. 1956లో గురుదత్ తన ‘సి.ఐ.డి.’ సినిమాతో వహిదాను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో బొంబాయితారగానే మిగిలిపోయారు వహిదా రెహమాన్. మొదట్లో గురుదత్, దేవానంద్ చిత్రాలలోనే మురిపించిన వహిదా రెహమాన్ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలా ఆమెకు తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘బీస్ సాల్ బాద్’. బిశ్వజిత్…
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్…