సంక్రాంతి సరే.. ‘సైకో సాంబ’ కరోనా సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్డౌన్తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.
కరోనాను జయించే సంజీవిని కోవిడ్ టీకాలు పంపణీ కార్యక్రమం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కరోనా కట్టడికి అడుగులు వేశాయి. దీంతో కరోనా రక్కసి రెక్కలు కట్ చేసినట్లుగా దేశంలో తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నామని ఆనందపడేలోపే.. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించింది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తితో తగ్గుముఖం పట్టిన కరోనా రక్కిసి రెక్కలు మరోసారి చాస్తోంది. మొన్నటి క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలతోనే కరోనా కేసులు ఒక్కసారిగా భారీస్థాయిలో పెరిగిపోతున్నాయి. క్రిస్మస్కు ముందు దేశవ్యాప్తంగా 20 వేలలోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం 1.50 లక్షల పై చిలుకు నమోదవుతున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థచేసుకోవచ్చు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
అయితే గత రెండు సంవత్సరాలు కరోనా ప్రభావంతో అన్ని పండుగలు మొక్కుబడిగా జరుపుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి కరోనా వచ్చినా.. ఒమిక్రాన్ వచ్చినా.. తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగువారికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో సంక్రాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండగు వస్తుందంటే చాలు.. దేశంలో ఏ చోట ఉన్నా.. అంతేందుకు ప్రపంచంలో ఏ చోటా ఉన్నా.. ఈ పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతుంటారు. ఎంతో ఆనందంగా అందరూ వేచిచూస్తున్న సంక్రాంతి పండుగ పట్టుమని పది రోజులు కూడా లేదు.
ఈ సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి.. కరోనా కేసులు పెరగడం చూస్తుంటే.. ఈ సారి సంక్రాంతి తరువాత కరోనా కేసులు బీభత్సంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వారు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను జరుపుకోవాల్సిందే..
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!