మాటల మాయావి.. పింగళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది
పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29న బొబ్బిలి సమీపంలోని రాజాంలో జన్మించారు. వారి బంధువులంతా మచిలీపట్నంలో ఉండడంతో పింగళివారి కుటుంబం కూడా బందరు చేరుకుంది. బాల్యం నుంచీ బాగా చదివే అలవాటు ఉండేది. ఏ కొత్త పదం కనిపించినా, ఎంతో ఆసక్తిగా దానిపై పరిశోధన చేసేవారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివిన పింగళి తరువాత స్వరాజ్య పోరాటానికి ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో ‘జన్మభూమి’ అనే రచన చేశారు. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న కారణంగా జైలు జీవితం కూడా గడిపారు. కొద్ది రోజులు ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత బెంగాల్ నాగపూర్ రైల్వేస్ లో ఉద్యోగం చేశారు. తరువాత మచిలీ పట్నం వచ్చి, ‘వింధ్యరాణి’ అనే నాటకం రాశారు. అది మంచి పేరు సంపాదించి పెట్టింది. రచయితగా పింగళి మంచి పేరు సంపాదించిన రోజులలోనే ఆయనకు సినిమా రంగంలో అడుగు పెట్టే అవకాశం కలిగింది.
Also Read
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
‘శ్రీకృష్ణ లీలలు’తో సంభాషణలు రాస్తూ వచ్చారు. తరువాత “భలే పెళ్ళి, వింధ్యరాణి, గుణసుందరి కథ” చిత్రాలకు పాటలు, మాటలు రాస్తూ సాగారు. విజయావారి తొలి జానపదం ‘పాతాళభైరవి’లో పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. అందులో ఆయన పలికించిన “నిజం చెప్పమన్నారా…అబద్ధం చెప్పమన్నారా…” అన్న మాటలు, “తప్పు తప్పు…” అనే ఊతపదాలు, “డింగరీ, బుల్ బుల్…”అనే పదాలు జనాన్ని కట్టిపడేశాయి. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు పింగళి వారి రచన దన్నుగా నిలచింది. ఘనవిజయాలను సాధించి పెట్టింది.
ప్రాచీన భాషాప్రవీణుల ప్రయోగాల ప్రకారం ఓ పదాన్ని తిప్పి వేస్తే దానికి వ్యతిరేకం వస్తుందని అంటారు. అలాంటి పదాలనూ పలికించి వినోదం పంచారు. ‘మిస్సమ్మ’ లోని “బృందావనమది అందరిదీ…” పాటలో “‘ఈసునసూయలు’ అన్న పదం వేశారు. చాలామంది దానిని “ఈ సునసూయలు…’ గా భావించారు. నిజానికి “ఈసు, అసూయ” అన్న పదాలను కలిపి “న”కారాదేశంతో “ఈసునసూయలు” అన్న సమాసం చేశారు పింగళి. భూతాల భాష ఎలా ఉంటుందో కూడా ‘జగదేకవీరుని కథ’ లో పలికించారు. ఇక పదాలను సంక్షిప్తీకరించడం (Abbreviation)లోనూ ఆయనది అందెవేసిన చేయే.
‘శ్రీకృష్ణార్జున యుద్దం’ లో తీర్థయాత్రలు చేస్తూ స్వాముల వారి వేషంలో ద్వారకలో ప్రవేశిస్తాడు అర్జునుడు. అప్పుడు అతనికి ఓ పేరు కావాలి కదా! అందుకు అర్జునుని వెంట వచ్చిన సన్యాసి ఆయనకున్న దశ నామాలను సంక్షిప్తం చేసి “అజిబీ ధఫపా విశ్వేశకి స్వామి” అని పేరు పెట్టారు. తరువాతి రోజుల్లో “పా.కో.కు.” అంటే “పాకెక్కి కోడిలా కూస్తా…” అన్న జంధ్యాల ప్రయోగానికి ఇదే స్ఫూర్తిగా నిలచింది. ఇక కొత్త పదాలను కనిపెట్టడంలోనూ దిట్ట ఆయన. అందుకు వ్యాకరణం అనుమతించదని తెలిసే కాబోలు “ఎవరూ కనిపెట్టకుండా కొత్త పదాలుఎలా పుడతాయ్…” అంటూ ‘మాయాబజార్’ లో ఘటోత్కచునితో చెప్పించారు.
“ఎకిమీడా…” అన్న పదం ఆ మధ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక చిత్రంలో వినిపించగానే ఈ కాలం పిల్లలు ఆహా ఓహో అంటూ పాత పదాన్ని పసందుగా పలికించారని రచయితపై అభినందన జల్లులు కురిపించారు. ‘రాజకోట రహస్యం’ లోనే పింగళి… “ఘన నాట్యము…ఆడే ఎద తూలేవోయ్ ఎకిమీడా…” అంటూ పలికించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పింగళి తన దరికి చేరిన ప్రతి అవకాశంలోనూ తనదైన బాణీ పలికించాలనే ప్రయత్నించారు. అలాగే సఫలీకృతులయ్యారు. పింగళి రచనలో జాలువారిన మాటలు, పాటలు వింటే ఆయన పాండిత్యంలోని మాధుర్యం మనకు మహదానందం కలిగిస్తుంది. భావి రచయితలకు పింగళి రచనతో రూపొందిన చిత్రాలే అధ్యయనాలు. అలా అనడానికి, ఆయనను అనుసరించి ఈ తరంలో ‘మాటల మాంత్రికులు’ అనిపించుకుంటున్నవారే నిదర్శనం. అంతలా జనాన్ని అలరించిన పింగళి 1971 మే 6న తనువు చాలించారు. ఆయన మాటలు మాత్రం మనకు కితకితలు పెడుతూనే ఉండడం విశేషం!
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?