Raavi Kondalarao: రచన, నటన రావి కొండలరావు రెండు కళ్ళు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటను పట్టుకొని సినిమా బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే విజయం సాధించారు. కొందరు మాటలు పలికించడంతో పాటు, తెరపైనా గిలిగింతలు పెట్టారు. వారిలో రావి కొండలరావు సైతం స్థానం సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటకరచయితగా ఇలా సాగిన తరువాతే చిత్రసీమ బాటపట్టారు రావి కొండలరావు. తరువాత చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అలరించారాయన.
రావి కొండలరావు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. రావి కొండలరావు తండ్రి శ్రీకాకుళంలో పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవారు. అందువల్ల కొండలరావు చదువు కూడా అక్కడే సాగింది. చదువుకొనే రోజుల్లోనే పన్నెండేళ్ల వయసులో ఆయన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అప్పట్లో ఆర్.ఎస్.ఎస్.; హిందూ మహాసమ్మేళన్ పై నిషేధం విధించారు. దానిని నిరసిస్తూ సత్యాగ్రహం సాగింది. ఈ నేపథ్యంలోనే కొండలరావు కూడా పాల్గొని, రాజమండ్రి జైలుకు వెళ్ళారు. దాదాపు మూడు నెలలు జైలులో ఉన్నారు. ఆ సమయంలోనే అనేక పుస్తకాలు చదివారు. అప్పుడే ‘మన మూహలు’ అనే పేరుతో కొన్ని కథలు రాశారు. వాటిలో కొన్ని ‘చందమామ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ‘చందమామ’ ఎడిటర్ కొడవంటి కుటుంబరావు స్ఫూర్తితో కథలు రాశారు. తరువాత ముళ్ళపూడి వెంకటరమణ కూడా ఆయనను ప్రోత్సహించారు. ముళ్ళపూడి కథతో తెరకెక్కిన యన్టీఆర్ ‘దాగుడుమూతలు’ చిత్రంతో తెరకు పరిచయం అయ్యారు రావి కొండలరావు. తరువాత బి.యన్.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.
Also Read
- Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
- Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
- I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
- RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
రావి కొండలరావు, రాధాకుమారి నాటకాలు వేస్తూ ఉండేవారు. వారు ప్రేమించి పెళ్ళాడారు. వారిద్దరూ అనేక చిత్రాలలో భార్యాభర్తలుగానే కనిపించారు. ఆయన నటించిన చాలా చిత్రాలలో తన పాత్రలకు తానే రచన చేసుకొనేవారు. అదే ఆయనకు అవకాశాలు కల్పించిందనీ చెప్పవచ్చు. రచయితలు సైతం రావి కొండలరావును ప్రోత్సహించారు. బాపు-రమణ తమ చిత్రాలలో ఆయనకు ఏదో ఒక పాత్ర ఇస్తూ వచ్చారు. అలాగే విజయా, యన్.ఏ.టి., అన్నపూర్ణ సంస్థలు నిర్మించన పలు చిత్రాల్లోనూ రావి కొండలరావు నటించారు. బి.నాగిరెడ్డి, చక్రపాణి నిర్వహిస్తున్న “చందమామ, విజయచిత్ర” పత్రికల్లో ఆయన రచనలు చేసేవారు. తరువాతి రోజుల్లో ఎడిటర్ విశ్వంకు ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ సాగారు. విజయా సంస్థాధినేతలతో రావి కొండలరావుకు ఉన్న అనుబంధం తరువాతి రోజుల్లో వారి వారసులు నిర్మించిన “బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం” వంటి చిత్రాల రచనలో పాలు పంచుకొనేలా చేసింది. అలాగే సదరు చిత్రాలకు ఆయన సంచాలకునిగానూ వ్యవహరించారు. హైదరాబాద్ లో ఉంటూ పలు పుస్తకాలు వెలుగులోకి తెచ్చారు. 2020 జూలై 28న ఆయన కన్నుమూశారు. ఈ నాటికీ ఆయన రచన చేసిన సినిమా పుస్తకాలను అభిమానులు ఆసక్తిగా చదువుతూనే ఉండడం విశేషం!
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!