కొందరు నేతల ప్రవర్తనకు, ఉపన్యాసాలకు ఫిదా అయిపోతారు.. అభిమానులుగా మారిపోతారు.. తమ నేత ఏ నిర్ణయం తీసుకున్నా వాటికి మద్దతుగా నిలుస్తుంటారు.. వాటికి ప్రచారం చేస్తుంటారు.. ఇక, తమ నేత జోలికి ఎవరు వచ్చినా.. వీరు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు.. ఇలా మన నేతలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.. నచ్చిన నేత కోసం ప్రాణాలైనా ఇస్తామని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఓ వృద్ధ మహిళ రాహుల్ గాంధీపై తనకు ఉన్న అభిమానంతో.. తన ఆస్తినంతా…
రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర…
తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి ఆ పార్టీ శ్రేణులు.. కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా చెబుతున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. కొంత మంది సీనియర్లు అలకబూనారు.. కొందరు తిరిగి లైన్లోకి వచ్చినట్టే…
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు గ్యాస్ సిలిండర్కు దండలు వేసి డప్పులు కొడుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, అధిరంజన్ చౌధురి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు తదితర ఎంపీలు పాల్గొన్నారు.…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పెట్రో ధరల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని నరేంద్ర…
ఇటీవల 40 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక్కొక్కరికి రెండులక్షల బీమా చేయించనున్నారు. మొత్తం 40లక్షల మందికి ఆరున్నర కోట్ల రూపాయల ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ చేతుల మీదుగా బీమా సంస్థలకు రేవంత్ రెడ్డి బృందం అందజేయనుంది. అయితే ఈ నెలతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలోని 32 వేల…
ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు… వీళ్ళు ఎవరో పంపితే పోస్టు చేసినట్టు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నిలబడలేదని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసారని, విషయం లేక ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి…
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. రైతులకు భరోసా ఇచ్చే మాట చెప్పారు రాహుల్ గాంధీ అని, తలకాయ ఉన్న ఎవరికైనా తప్పు అనిపించదన్నారు. కానీ కన్నుమిన్ను ఆనకుండా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితం లేకుండా కవిత ట్వీట్ చేశారని, మీరు వేసే చిల్లర రాజకీయంలో మేము భాగస్వామ్యం కావాలా..? అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిజాయితీనీ అడుగుతున్నారని,…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ…