Putin: రష్యా తన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 30 ఏళ్ల తరువాత తొలిసారిగి అణుసమార్థ్యం ఉన్న ఆయుధ పరీక్షను నిర్వహించింది రష్యా. అణుశక్తితో నడిచే, అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్ క్షిపణి అయిన ‘బ్యూరేవెస్ట్నిక్’ని విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ చెప్పారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై దాదాపుగా పనిని పూర్తి చేసిందని వెల్లడించారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి వెస్ట్రన్ దేశాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘‘రష్యా కొత్త ప్రపంచాన్ని నిర్మించే పనిలో ఉంది’’ అని గురువారం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెస్ట్రన్ దేశాలే కారణమని నిందించారు. ప్రపంచ ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలకు ఎప్పుడూ ఓ శతృవు కావాలని ఎద్దేవా చేశారు. వాల్దాయ్ పొలిటికల్ ఫోరమ్ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Vivek Ramaswamy: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.
Putin: చైనా, రష్యా దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును తప్పుపడుతున్నాయి. మరోవైపు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇదే విధంగా చైనాతో అమెరికా సంబంధాలు పూర్తిగా దిగజరాయి. మరోవైపు యూరోపియన్ దేశాలకు కూడా చైనా అంటే నమ్మకం సన్నగిల్లింది. కోవిడ్ తర్వాత చైనాతో అరకొర సంబంధాలను కంటిన్యూ చేస్తున్నాయి ఆయా దేశాలు.
Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. అయినా ఎక్కడా తగ్గకుండా కిమ్ నార్త్ కొరియా నుంచి తన ప్రత్యేక రైలులో రష్యా వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా కిమ్ దేశాన్ని వదిలి రష్యా పర్యటనకు…
G20 Summit: ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని
Kim Jong Un: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఒత్తిడిని లెక్క చేయకుండా ఉత్తకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కానున్నారు. కిమ్ తన ప్రత్యేక రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాలో వ్లాదివోస్టోక్కి ఆదివారం వెళ్లారు.
Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.