Russia: గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం, కత్తితో 111 సార్లు పొడిచి చంపిన నిందితుడికి పుతిన్ క్షమాభిక్ష.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేరంలో అతనికి 17 ఏళ్ల శిక్ష పడింది.
Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న ఖైదీలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతోంది. దీంట్లో భాగంగానే కాన్యుస్ని జైలు నుంచి విడుదల చేశారు. ఇటీవల సైనిక యూనిఫాంలో ఉన్న కాన్యూస్ ఫోటోను చూసిన బాధితురాలు వెరా తల్లి ఒక్సానా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది నాకు పెద్ద దెబ్బ, నా బిడ్డ ఆత్మ కూడా శాంతించదు, నా జీవితంలో ఆశను కోల్పోయానని విలపించింది. అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ముగించిందని, నాకు ఏమి చేయాలో తెలియడం లేదని ఆక్రోశం వెల్లగక్కింది. రష్యాను రక్షించడానికి అలాంటి క్రూరుడికి ఆయుధాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి కాన్యూస్ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధృవీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా బుధవారం తెలిపారు. నవంబర్ 3న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన క్షమాభిక్ష లేఖను ఆమె పంచుకుంది. ఏప్రిల్ 27న ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా అతనికి క్షమాభిక్ష పెట్టారు. ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులు రక్తంతో తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అన్నారు.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!