Russia: గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం, కత్తితో 111 సార్లు పొడిచి చంపిన నిందితుడికి పుతిన్ క్షమాభిక్ష.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేరంలో అతనికి 17 ఏళ్ల శిక్ష పడింది.
Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న ఖైదీలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతోంది. దీంట్లో భాగంగానే కాన్యుస్ని జైలు నుంచి విడుదల చేశారు. ఇటీవల సైనిక యూనిఫాంలో ఉన్న కాన్యూస్ ఫోటోను చూసిన బాధితురాలు వెరా తల్లి ఒక్సానా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది నాకు పెద్ద దెబ్బ, నా బిడ్డ ఆత్మ కూడా శాంతించదు, నా జీవితంలో ఆశను కోల్పోయానని విలపించింది. అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ముగించిందని, నాకు ఏమి చేయాలో తెలియడం లేదని ఆక్రోశం వెల్లగక్కింది. రష్యాను రక్షించడానికి అలాంటి క్రూరుడికి ఆయుధాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి కాన్యూస్ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధృవీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా బుధవారం తెలిపారు. నవంబర్ 3న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన క్షమాభిక్ష లేఖను ఆమె పంచుకుంది. ఏప్రిల్ 27న ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా అతనికి క్షమాభిక్ష పెట్టారు. ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులు రక్తంతో తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అన్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!