Putin: ఇజ్రాయిల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే హమాస్ క్రూరదాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమస్య పరిష్కరించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు మీడియా నివేదించింది.
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
Read Also: Janvi Kapoor : ఏంటి జాన్వీ పాప మొత్తం చూపిస్తే ఎలా..ఇంత హాట్నెస్ కి కుర్రాళ్లు తట్టుకోలేరు..
కిర్గిజ్స్తాన్ వేదికగా జరుగుతున్న పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్)’ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరయ్యారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ సమస్యకు చర్చలే ప్రత్యామ్నాయం అని పుతిన్ అన్నారు. చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి ‘టూ స్టేట్ ఫార్ములా’ను అమలు చేయడం, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించడం, ఇజ్రాయిల్ తో శాంతి, భద్రతతో సహజీవనం చేయడానికి సహాయపడుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ క్రూరమైన దాడికి గురైంది. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయడం చాలా కీలకమని పుతన్ చెప్పారు. టూ స్టేట్ ఫార్ములాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, వేరే దేశ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు గానూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే రష్యా, కిర్గిజ్ స్తాన్ రెండు దేశాలు కూడా ఐసీసీలో భాగస్వామ్య దేశాలు కావు. వచ్చే వారం చైనాలో జరిగే బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశానికి పుతిన్ ఆ దేశానికి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!