ఈరోజుల్లో దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుండటంతో పాటు మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో మహిళలు తమకు నచ్చిన వ్యక్తులను ఎంచుకొని వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో దేశంలో పెళ్లికాకుండా మిగిలిపోతున్న పురుషుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఒక్కపెళ్లి కోసమే చాలా మంది ఎదురుచూస్తుంటే, ఒడిశాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందరూ కలిసి ఉంటారా అంటే లేదు. ఒకరికి తెలియకుండా మరోకరిని వివాహం…
పంజాబ్లో ఈనెల 20 వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, పంజాబ్ సిక్కుగురు జయంతి వేడుకలు ఉండటంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమదైన హామీలు ఇస్తూ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళిదళ్ పార్టీలు కలిసి కూటమిగా…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
డ్రై అంటే ఎండిపోడం, డే అంటే రోజు. డ్రైడే అంటే ఎండిపోయిన రోజు అని అర్థం. డ్రైడే అనే పదాన్ని దేనికోసం వాడతారు అంటే, లిక్కర్ హాలిడే కోసం డ్రైడే అనే పదాన్ని వినియోగిస్తారు. సాధారణంగా దేశంలో లిక్కర్ షాపులను బంద్ చేసిన రోజును డ్రైడే అని పిలుస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో డ్రైడే ఒకేవిధంగా ఉండదు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా లిక్కర్ హాలిడే కాబట్టి ఆరోజుల్లో డ్రైడే నడుస్తుంది.…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఓవైపు పాలక కాంగ్రెస్.. మరోవైపు ఆప్, ఇంకో వైపు అమరీందర్సింగ్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారి ఉన్నారు.. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్యుద్ధం మాత్రం ముగియడంలేదు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తానే సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటు తప్పకపోగా.. సిట్టింగ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్…
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.…
ఆనంద్ మహీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మట్టిలోని మాణిక్యాలను తన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తాజగా ఆనంద్ మహీంద్రా పంజాబ్ లోని అమృత్సర్లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెలల క్రితం అమృత్సర్లోని సుల్తాన్ గేట్ వద్ద ఓ చిన్న రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. అయితే, దాని యజమాని హఠాత్తుగా చనిపోవడంతో 17, 11 ఏళ్ల…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే…
త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ తర్వాత పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. కానీ, అంతర్గత కుమ్మలాటలతో బయటకు వెళ్లిపోయి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.. ఇక, పీఎల్సీ అధ్యక్షుడు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్…
ఓ ముఖ్యమంత్రి.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తారు.. అయితే, పంజాబ్లో రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. పీసీసీ చీఫ్గా ఉన్న నవజ్యోత్ సింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చన్నీ.. ఓవైపు సీఎం, పీసీసీ చీఫ్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. పోటీపోటీ ర్యాలీలు, సభలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. అయితే, ఇవాళ ఓ ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చన్నీ.. ఆసక్తికర సమాధానం చెప్పారు.. త్వరలో…