Earthquake: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…
Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది.
పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు.
Gas leak : పంజాబ్లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని బుధవారం చండీగఢ్లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యలతో మరణించిన బాదల్కు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ చండీగఢ్ చేరుకున్నారు.