IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు చెరో 10 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.
Also Read : Revanth Reddy : 5 అంశాలతో యూత్ డిక్లరేషన్.. వివరాలు వెల్లడించిన రేవంత్
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ టీమ్ భావిస్తోంది. శిఖర్ ధావన్, ప్రభ్సిమ్రాన్ సింగ్ లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే తొలి ఓవర్ లోనే ప్రభు సిమ్రాన్ సింగ్ మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఇక రెండో ఓవర్ను హర్షిత్ రాణా వేయగా 9 పరుగులు వచ్చాయి. మొదటి, మూడో బంతికి శిఖర్ ధావన్ బౌండరీలు కొట్టాడు. అయితే చివరి బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవడంతో ప్రభ్సిమ్రాన్ సింగ్(12) ఔట్ అయ్యాడు. దీంతో 21 పరుగులకే పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స( 0) డకౌట్ అయ్యాడు.
Also Read : Karnataka Polls: సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ఈసీకి ఫిర్యాదు
హర్షిత్ రాణా బౌలింగ్ లోనే రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ పట్టుకోవడంతో భానుక రాజపక్స పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో 29 పరుగులకే పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన మంచి ఊపుమీద కనిపించాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్(15) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 53 పరుగులకే పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ ను కోల్పోయింది.
Also Read : RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ ( 31 బంతుల్లో 7 ఫోర్లతో 33 పరుగులు ), జితేశ్ శర్మ ( 11 బంతుల్లో 15 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

తాజావార్తలు
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..