IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు చెరో 10 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.
Also Read : Revanth Reddy : 5 అంశాలతో యూత్ డిక్లరేషన్.. వివరాలు వెల్లడించిన రేవంత్
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ టీమ్ భావిస్తోంది. శిఖర్ ధావన్, ప్రభ్సిమ్రాన్ సింగ్ లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే తొలి ఓవర్ లోనే ప్రభు సిమ్రాన్ సింగ్ మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఇక రెండో ఓవర్ను హర్షిత్ రాణా వేయగా 9 పరుగులు వచ్చాయి. మొదటి, మూడో బంతికి శిఖర్ ధావన్ బౌండరీలు కొట్టాడు. అయితే చివరి బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవడంతో ప్రభ్సిమ్రాన్ సింగ్(12) ఔట్ అయ్యాడు. దీంతో 21 పరుగులకే పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స( 0) డకౌట్ అయ్యాడు.
Also Read : Karnataka Polls: సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ఈసీకి ఫిర్యాదు
హర్షిత్ రాణా బౌలింగ్ లోనే రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ పట్టుకోవడంతో భానుక రాజపక్స పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో 29 పరుగులకే పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన మంచి ఊపుమీద కనిపించాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్(15) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 53 పరుగులకే పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ ను కోల్పోయింది.
Also Read : RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ ( 31 బంతుల్లో 7 ఫోర్లతో 33 పరుగులు ), జితేశ్ శర్మ ( 11 బంతుల్లో 15 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!