చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్ఇన్స్పెక్టర్ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు.
Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
మ్యాట్రిమోని పేరుతో నైజీరియన్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 1020 కేసుల్లో నిందితుడిగా ఓ నైజిరియన్ అలెక్స్ ఉన్నాడు. ఇప్పటి వరకు 12 కేసులను సైబర్ పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ పోలీసులు.. చదువు కోసం ఇండియాకు వచ్చి నైజీరియన్ అలెక్స్ అక్రమాలకు పాల్పడ్డాడు.
బీహార్లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.