Uttar Pradesh: సైకిల్పై వస్తుండగా విద్యార్థిని చున్నీ లాగిన నిందితులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని వేధించిన నిందితులంతా ఫలానా వర్గానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హీరాపూర్లోని రామ్జీ ఇంటర్ కాలేజీ నుంచి విద్యార్థిని సైకిల్ పై ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఇద్దరు అగంతకులు బైకుపై వచ్చి చున్నీ లాగారు. దీంతో విద్యార్థి అదుపు తప్పి కింద పడిపోయింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం విద్యార్థి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
King of Kotha : ఓటీటీ లోకి రాబోతున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులు ప్రత్యేక వర్గానికి చెందినవారు కాగా.. మొదట్లో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. అయితే ఆ తర్వాత సీసీటీవీ వీడియో బయటికిరావడంతో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతకుముందు కూడా తమ కూతురిని ఫలానా వర్గానికి చెందిన యువకులు వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని తెలిపారు.
Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
మరోవైపు ఈ ప్రాంతంలో తరచూ అగంతకులు రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను ఎగతాళి చేస్తుంటారని తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షాబాజ్, అర్బాజ్, ఫైసల్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హస్వార్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ రితేష్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!