Uttar Pradesh: సైకిల్పై వస్తుండగా విద్యార్థిని చున్నీ లాగిన నిందితులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని వేధించిన నిందితులంతా ఫలానా వర్గానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హీరాపూర్లోని రామ్జీ ఇంటర్ కాలేజీ నుంచి విద్యార్థిని సైకిల్ పై ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఇద్దరు అగంతకులు బైకుపై వచ్చి చున్నీ లాగారు. దీంతో విద్యార్థి అదుపు తప్పి కింద పడిపోయింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం విద్యార్థి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
King of Kotha : ఓటీటీ లోకి రాబోతున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
Also Read
ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులు ప్రత్యేక వర్గానికి చెందినవారు కాగా.. మొదట్లో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. అయితే ఆ తర్వాత సీసీటీవీ వీడియో బయటికిరావడంతో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతకుముందు కూడా తమ కూతురిని ఫలానా వర్గానికి చెందిన యువకులు వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని తెలిపారు.
Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
మరోవైపు ఈ ప్రాంతంలో తరచూ అగంతకులు రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను ఎగతాళి చేస్తుంటారని తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షాబాజ్, అర్బాజ్, ఫైసల్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హస్వార్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ రితేష్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!