Uttar Pradesh: సైకిల్పై వస్తుండగా విద్యార్థిని చున్నీ లాగిన నిందితులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని వేధించిన నిందితులంతా ఫలానా వర్గానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హీరాపూర్లోని రామ్జీ ఇంటర్ కాలేజీ నుంచి విద్యార్థిని సైకిల్ పై ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఇద్దరు అగంతకులు బైకుపై వచ్చి చున్నీ లాగారు. దీంతో విద్యార్థి అదుపు తప్పి కింద పడిపోయింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం విద్యార్థి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
King of Kotha : ఓటీటీ లోకి రాబోతున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులు ప్రత్యేక వర్గానికి చెందినవారు కాగా.. మొదట్లో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. అయితే ఆ తర్వాత సీసీటీవీ వీడియో బయటికిరావడంతో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతకుముందు కూడా తమ కూతురిని ఫలానా వర్గానికి చెందిన యువకులు వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని తెలిపారు.
Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
మరోవైపు ఈ ప్రాంతంలో తరచూ అగంతకులు రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను ఎగతాళి చేస్తుంటారని తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షాబాజ్, అర్బాజ్, ఫైసల్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హస్వార్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ రితేష్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!