అంగన్వాడీల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో అటు పోలీసులు ఇటు అంగన్వాడీల మధ్య వివాదం చెలరేగింది.
టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకి వెళ్లిన నదీమ్ తాహెర్ ఎంతకి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కాల్ తియ్యలేదు. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీకున సంగారెడ్డి జిల్లా లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
భువనగిరి జిల్లాలో కల్తీపాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో ఇవాళ (బుధవారం) ఈ ఘటన వెలుగులో వచ్చింది.
గణేష్ నిమర్జనం సమయంలో తాండూరులో జిల్లా పోలీసులను వాడడం మంచి పరిణామం కాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో నిర్వహించిన శాంతి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్ఇన్స్పెక్టర్ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు.