Andhra Pradesh Crime: వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
Andhra Pradesh Crime: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు.. కుల, మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. అయితే, కొన్ని ప్రాంతాల్లో అపశృతిలు చోటు చేసుకున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో వినాయక విగ్రహం విషయంలో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం ఒకరి మృతికి కారణమ్తెయింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరగిల్లులో చోటు చేసుకుంది. గ్రామంలోని బీసీ క్వాటర్స్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం విషయంలో యువకులు గొడవపడ్డారు. ఈ గొడవ కాస్తా గ్రామంలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.. ఈ దాడిలో అనంతయ్య అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కావడంతో.. అక్కడికక్కడే మృతిచెందినట్టుగా స్థానికులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మరో 10 మంది గ్రామస్థులు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేసుకున్న పోలీసులు.. అనంతయ్య మృతదేహన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘర్షణ, హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
Read Also: Viral News : పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.. ఇడ్లీలు అమ్ముకుంటున్న చంద్రయాన్ -3 టెక్నీషియన్
Also Read
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!