Bihar: విగ్రహ నిమజ్జనంలో అపశృతి.. చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు నెలకొనగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీజ్ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి మహిళలు పూజలు చేసినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పూజ అనంతరం.. చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు డొమినియా ఖండానికి వెళ్లారు. నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తుండగా ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన అక్కాచెల్లెళ్లు జూలీ కుమారి(10), జ్యోతి కుమారి (8) గా గుర్తించారు.
Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం
చెరువు లోతు ఎక్కువగా ఉండటం వలనే వారు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు బాలికలు నీటిలో మునిగిపోతున్నప్పుడు.. ఓ స్థానిక వ్యక్తి చూసి ముగ్గురు బాలికలను రక్షించాడు. మిగతా ఇద్దరిని కాపాడలేకపోయాడు. ఈ ఘటన తర్వాత.. పండుగ మరుసటి రోజే మృతుల ఇంట్లో శోకసంద్రంగా మారింది. మరోవైపు మృతుల కుటుంబాలకు ఈ ప్రమాదం జరగడం వల్ల వచ్చిన డబ్బులను అందజేయనున్నారు.
- Tags
- died
- police
- pond
- sisters
- telugu news
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!