Bihar: విగ్రహ నిమజ్జనంలో అపశృతి.. చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు నెలకొనగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీజ్ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి మహిళలు పూజలు చేసినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పూజ అనంతరం.. చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు డొమినియా ఖండానికి వెళ్లారు. నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తుండగా ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన అక్కాచెల్లెళ్లు జూలీ కుమారి(10), జ్యోతి కుమారి (8) గా గుర్తించారు.
Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం
చెరువు లోతు ఎక్కువగా ఉండటం వలనే వారు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు బాలికలు నీటిలో మునిగిపోతున్నప్పుడు.. ఓ స్థానిక వ్యక్తి చూసి ముగ్గురు బాలికలను రక్షించాడు. మిగతా ఇద్దరిని కాపాడలేకపోయాడు. ఈ ఘటన తర్వాత.. పండుగ మరుసటి రోజే మృతుల ఇంట్లో శోకసంద్రంగా మారింది. మరోవైపు మృతుల కుటుంబాలకు ఈ ప్రమాదం జరగడం వల్ల వచ్చిన డబ్బులను అందజేయనున్నారు.
- Tags
- died
- police
- pond
- sisters
- telugu news
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!