Hyderabad: షాద్ నగర్ లో సినిమా స్టైల్ లో మర్డర్.. ఐదుగురు అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాద్ నగర్ లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నారని కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ కుమార్ హత్య చేశాడు. బీహార్ కు చెందిన చంద్రకుమార్ అనే సినిమాను అదే స్టైల్ లో కరుణ కుమార్ అనే యువకుడిని రంజిత్ హతమార్చాడు. శంషాబాద్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉంటుంది. అయితే, గత నెల 29 తేదిన కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన అన్న దీపక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
Read Also: Vijay Antony: విజయ్ కూతురు ఆత్మహత్య.. ప్రభాస్ నిర్మాతల కీలక నిర్ణయం
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
అయితే, రంజిత్ కుమార్ అనే వ్యక్తి కరుణ కుమార్ ను హత్య చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళిక రూపొందించి.. గత నెల 15 వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో వరి చేను పొలం దగ్గరికి కరుణ కూమార్ ను పిలిపించుకొని కాళ్లు చేతులు కట్టేసి.. వరి చేను నీటి బురదలో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు అని డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: 3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా
అయితే రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతో ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై 302, 201, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్ తో పాటు మంతోష్ కుమార్, దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు అయ్యారు. అయితే, మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను మీడియాకు వెల్లడించేందుకు డీసీపీ నారాయణ రెడ్డి నిరాకరించాడు. మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!