రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది.
డీగ్ జిల్లాలోని గోపాల్గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్ను అరెస్టు చేశారు.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ కావడంతో ముగ్గురూ చాలా క్లోజ్గా ఉండేవారు. ఆ క్లోజ్నెస్కు లవ్ అని పేరు పెట్టేసిన శివకుమార్.. సంఘవికి తన మనసులోని మాట చెప్పాడు. చిన్ననాటి స్నేహితులం కదా అని చనువిస్తే.. ఇదేం పద్దతి అంటూ పృథ్వి, సంఘవి శివకుమార్కు వార్నింగ్ ఇచ్చారు.
ఎండీఎంఏ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైంది అని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. ఎండీఎంఏ మత్తు మందును తీసుకుంటే 24 గంటలు పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అంతేకాదు ఇటీవల కాలంలో మెట్రో నగరాలు ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అని ఆయన వ్యాఖ్యనించారు.