దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల్లో.. పట్టణాల్లో ఉల్లాసంగా.. ఉత్సాహం సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్త బట్టలతో.. రకరకాలైన పిండి వంటలతో పల్లెలన్నీ సందడి.. సందడిగా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో జోరు సాగుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ పర్యటనకు రాబోతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీని కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయని ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ముఖ చిత్రాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి అలర్ట్ అయ్యాయి. అధికారం కోసం రెండు కూటమిలు ఆరాటపడుతున్నాయి.
భారతదేశ యువత, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) తరానికి చెందిన వారిలో అపారమైన సృజనాత్మకత దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ఆయన, నేటి యువత కేవలం కొత్త ఆలోచనలతో సరిపెట్టుకోకుండా, అంకితభావంతో దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో…
దేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. జనవరి 17న గౌహతి, కోల్కతాలను కలిపే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డా టౌన్లో ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారు. ఈ రైలు కామాఖ్య, హౌరా జంక్షన్ మధ్య వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ ప్రీమియం క్లాస్ ట్రైన్ ఛార్జీల…
ట్రంప్ సన్నితుడు సెర్గియో గోర్ (38) భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. గత నవంబర్లో ఆయన నియమితులయ్యారు. తాజాగా ఆయన భారతదేశంలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో సందడి చేశారు. సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు కలిసి గాలి పటాలు ఎగరవేశారు.
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.