PM Modi: భారత్-యూరప్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక సహకారాన్ని విస్తరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన 7 దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇదే కాకుండా ఇద్దరు గ్లోబల్ సీఈఓలతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, కజకిస్తాన్, భూటాన్ దేశాల నాయకులతో చర్చల్లో పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్తో సహా పలు దేశాధినేతలంతా భారత్కు చేరుకున్నారు.
PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఈ నెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగి ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. రెండేళ్ల అనిశ్చితి తర్వాత, ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, తారిఖ్ ప్రమాణస్వీకారానికి దక్షిణాసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఆహ్వానం అందింది.
Tarique Rahman: ‘‘బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదంలో ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, యూనస్ పరిపాలనతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, తారిఖ్ గెలుపు తర్వాత రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా భారత సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ తొలిసారిగా స్పందించారు. బంగ్లాదేశ్ ఇంట్రెస్టుల ఆధారంగా భారత…
PM Modi: రెండేళ్ల అనిశ్చితి తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. దివంగత మా ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు బంగ్లాను పాలించిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారానికి తెరపడనుంది.
PM Modi: బ్రిటిష్ కాలం నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త అడ్రస్ ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా కీలకమైన కార్యనిర్వాహక విధులను ఏకీకృతం చేయడానికి, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కొత్త అధునాతన సముదాయాన్ని ప్రారంభించారు. Read Also: Chiranjeevi: డిజిటల్ తెరపై మెగా రికార్డు! ఓటీటీలో ఒక్కరోజులోనే సరికొత్త…
Arjun Tendulkar wedding: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనున్న సంగతి తెలిసిందే. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సందర్భంగా టెండూల్కర్ కుటుంబం నేడు (మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు! అర్జున్, సానియా వివాహానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. సెక్షన్ 94C కింద స్పీకర్ను తొలగించాలంటూ నోటీసు ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు 103 ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును కాంగ్రెస్ అందజేసింది.
విద్యార్థులు టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో భాగంగా సోమవారం రెండో ఎపిసోడ్లో విద్యార్థులతో మోడీ చర్చించారు.