Home
Pm Modi
Pm Modi News
-
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అనే థీమ్తో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ ప్రాంతానికి గేమ్చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవాన్ని ప్రజలందరికీ చేరువ… -
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
NTA Exam Reform: ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలపై ఒక హైపవర్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగం పెంపు, పరీక్షల భద్రత, నిర్మాణాత్మక మార్పులు, పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటి సిఫారసులు చేయనుంది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్గా వ్యవహరిస్తారు. పలు రంగాల్లో నిపుణులైన వారు సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు వీరే:… -
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
PM Modi: భారతదేశ పరీక్ష విధానంలో సంస్కరణకు ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఆదివారం ప్రకటించారు. ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పుడు జైలులో ఉన్నారని ఆయన అన్నారు.… -
Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2సార్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సార్లు రాజీనామాకు ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆయన రాజీనామాను ఎన్డీయే సర్కార్ ఆమోదించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 20న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూడా ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. అయితే, విద్యారంగంలో సంస్కరణలు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం ఆయనను… -
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
Sharad Pawar: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం, నిరసనకారులతో చర్చలు జరపాలని తానే సూచించినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా తానే సలహా ఇచ్చినట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడిన ఆయన.. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, దేశ యువశక్తికి ఐక్యతకు ఇది గొప్ప విజయమని, నిరసనకు నైతిక మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు ఆయన… -
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది కేవలం ప్రతీకాత్మకమైన రాజీనామా అయినప్పటికీ.. దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి కీలక అడుగుగా అభివర్ణించారు. -
PM Modi: దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు.. అర్ధరాత్రి మరోసారి స్పందించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మరో వీడియోను విడుదల చేసి, దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. NEET (UG) పరీక్షలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో ప్రధాని మాట్లాడుతూ, “నిన్న రాత్రి మీ అందరిని కలిసే అవకాశం వచ్చింది. నేను పంచుకున్న వీడియోకు అపార స్పందన లభించింది. మీ విలువైన సూచనలకు హృదయపూర్వక… -
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ప్రధాని మోడీకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచ నాయకుల్లో మోడీ మొదటి స్థానంలో ఉంటారు. అంతగా మోడీకి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా మరోసారి సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
PM Modi: నీట్ పేపర్ వ్యవహారం, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే, కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పేపర్ లీక్పై కీలక బిల్లును తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు తీసుకురానున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత,… -
PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
PM Modi Paper Leak Law: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్లను అరికట్టేందుకు మరింత కఠినమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ప్రత్యేక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం జరిగే ప్రత్యేక కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కొత్త బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి గురువారం రాత్రి విడుదల…
తాజావార్తలు
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!