ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ… తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు…
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించింది. ఈ రూట్లల్లో ప్రయాణం.. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి:…
ట్విట్టర్ లో ‘గోబ్యాక్ మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 7 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి. మే 26న మోదీ తమిళనాడు పర్యటన ఉంది. హైదరాబాద్ తో పాటు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల నుంచి మోదీ టూర్ పై కొంతమంది వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూన్నాడంటూ ట్వీట్ చేస్తున్నారు. మాకు గుజరాత్ మోడల్…
భారత పౌరులందరికీ 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య బీమా అందిస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడింది. వెబ్ సైట్ ఓపెన్ అయింది.ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందవచ్చు. ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి…
తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ మాట్లాడుతూ.. పార్టీలో చేరికలుపై చర్చించి.. ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎందుకు ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. సంజయ్ పాద యాత్రతో పాటు సమాంతరంగా ఇతర కార్యక్రమాలు కూడా చేయాలని, ముఖ్య నేతలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. స్థానిక , సామాజిక, సంస్థాగత అంశాల పై దృష్టి పెట్టాలని, ఎస్సీ, ఎస్టీ నియోజక…
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం…
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి…
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది.…