Vijayashanti : ఎంతమంది గుంపులుగా, గ్రూపులుగా వచ్చినా.. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వారిలో విజయశాంతి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనన్నారు. మోడీ సభ రోజే… పోటీగా సభ పెడుతున్నారని, ఎంతమంది గుంపులుగా.. గ్రూపులుగా వచ్చినా… మేము సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లేదు… ఏం లేదు… అంతా ఉత్తిదేనని కొట్టేసిన ఆమె.. ప్రభుత్వం కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
Balka Suman : బీజేపీ దొంగల ముఠాగా తయారైంది
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
కలర్ బొమ్మలు పెట్టి ఫ్లెక్సీ లు పెట్టగానే టీఆర్ఎస్ ఏదో చేసినట్టు కాదని విజయశాంతి వ్యాఖ్యానించారు. పనికిమాలిన పనులు చేస్తోంది ప్రభుత్వమని, బీఆర్ఎస్ లేదు.. ఏం లేదు… టీఆర్ఎస్ పరిస్థితి వీఆర్ఎస్ అయితదంటూ సెటైర్లు వేశారు. యశ్వంత్ సిన్హా కోసం ర్యాలీ పెట్టుకుంటాం అంటే… నేనేం కామెంట్ చేయను. అవి రాష్ట్రపతి ఎన్నికలు… మా సభ రోజే పెట్టుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టమని ఆమె అన్నారు. డబ్బుల ఆశ చూపి… పోలీసులతో బెదిరించి… మభ్య పెట్టి మా కార్పొరేటర్లను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసిఆర్ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని, జాతీయ స్థాయి లో కేసిఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ దిక్కు లేదు గానీ జాతీయ స్థాయి లో ఏం చేస్తారని, బీజేపీ సమావేశాలతో టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని ఆమె చురకలు అంటించారు.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!