BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక సమావేశాల్లో తెలంగాణ మీద చేసే తీర్మానంతో రాజకీయ వేడి ప్రారంభమవుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా, టీఆర్ఎస్ కు మాత్రం సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో.. పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ఒక పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలను మరో పార్టీ కార్యకర్తలు చించేయడం మొదలైంది. కాగా.. రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం కాస్తా చేతల్లోకి వెళ్లిపోయింది. అయితే.. ఒకే రోజున ఇటు యశ్వంత్ సిన్హా ప్రోగ్రామ్లో కేసీఆర్ స్పీచ్.. దాని తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సాయంత్రానికి ప్రధాని మోడీ స్పీచ్ ఉండటం గమనార్హం. వీరిద్దరు పోటాపోటీగా జరుగుతున్న రెండు పార్టీల యాక్టివిటీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తుంది.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
read also: COVID 19: దేశంలో కొత్తగా 17,092 కేసులు..29 మరణాలు
అయితే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ నేతలు గంభీర ప్రకటనలు చేస్తున్నారు. కాగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది స్టార్టింగ్ పాయింట్ అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకుని నగరానికి, రాష్ట్రానికి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గడ్డమీద సమావేశం పెట్టుకునే కమలనాథులు పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ ద్వారా ప్రధానిని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..
P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!
- Tags
- Amit Shah
- bjp
- kcr
- nitin ghatkari
- PM Modi
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!