BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక సమావేశాల్లో తెలంగాణ మీద చేసే తీర్మానంతో రాజకీయ వేడి ప్రారంభమవుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా, టీఆర్ఎస్ కు మాత్రం సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో.. పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ఒక పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలను మరో పార్టీ కార్యకర్తలు చించేయడం మొదలైంది. కాగా.. రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం కాస్తా చేతల్లోకి వెళ్లిపోయింది. అయితే.. ఒకే రోజున ఇటు యశ్వంత్ సిన్హా ప్రోగ్రామ్లో కేసీఆర్ స్పీచ్.. దాని తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సాయంత్రానికి ప్రధాని మోడీ స్పీచ్ ఉండటం గమనార్హం. వీరిద్దరు పోటాపోటీగా జరుగుతున్న రెండు పార్టీల యాక్టివిటీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తుంది.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
read also: COVID 19: దేశంలో కొత్తగా 17,092 కేసులు..29 మరణాలు
అయితే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ నేతలు గంభీర ప్రకటనలు చేస్తున్నారు. కాగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది స్టార్టింగ్ పాయింట్ అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకుని నగరానికి, రాష్ట్రానికి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గడ్డమీద సమావేశం పెట్టుకునే కమలనాథులు పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ ద్వారా ప్రధానిని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..
P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!
- Tags
- Amit Shah
- bjp
- kcr
- nitin ghatkari
- PM Modi
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!