BJP V/s TRS: ముచ్చటగా మూడోసారి.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ గైర్హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా..నేనా..అన్న రీతిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం హైదరాబాద్ లో జరుగుతుండటం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆపరేషన్ తెలంగాణలో భాగంగానే బీజేపీ తన అత్యున్నత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు టీఆర్ఎస్ కూడా బీజేపీకి కౌంటర్ గా ఫ్లెక్సీ వార్ స్టార్ట్ చేసింది. బీజేపీకి ధీటుగా, ప్రధానం మోదీ వెళ్లే మార్గాల్లో కటౌట్లు, ప్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. వీరి రాక కన్నా ముందుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ప్రచారం కొరకు హైదరాబాద్ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా తన మంత్రులతో వెళ్లి యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోనున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర సీఎం హోదాలో కేసీఆర్ ఆహ్వానించాలి.. కానీ గడిచిన మూడు పర్యయాల్లో ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లలేదు. తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు మోదీని రిసీవ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఆ తరువాత మేలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ రానున్నారు మోదీ. ఈ మూడు సందర్బాల్లో కేసీఆర్ మోదీని ఆహ్వానించలేదు. ఈ ప్రోటోకాల్ వివాదం ఇరు పార్టీల మధ్య విమర్శలకు తావిచ్చింది. ఇటీవల కాలంలో మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, పీఎం మోదీపై నేరుగా అటాక్ చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!